నిజంనిప్పులాంటిది

May 06 2023, 15:46

ఎస్సీ వర్గీకరణపై మాయావతి వైఖరి స్పష్టం చేయాలి

ఈనెల 7న హైదరాబాద్ లో జరుగుతున్న తెలంగాణ భరోసా సభకు హాజరవుతున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎస్సీ వర్గీకరణ పై తన వైఖరి స్పష్టం చేయాలని ఎమ్మెస్పీ జిల్లా నాయకులు బకరం శ్రీనివాస్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా కో-కన్వీనర్ ఇరిగి శ్రీశైలం మాదిగ అన్నారు.

శనివారం స్థానిక ఆర్.అండ్.బి అతిథి గృహములో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ....

ఎస్సీలలో ఎవరి జనాభా ఎంత ఉందో వారికి అంత వాటా ఉండాలనేది కాన్సిరాం సిద్ధాంతమని ఆ సిద్ధాంతానికి బహుజన సమాజ్ పార్టీ కట్టుబడి ఉంటే బెహన్ మాయావతి తక్షణమే ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపాలని డిమాండ్ చేశారు.

బెహన్ మాయావతి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో దాటవేత ధోరణి అవలంబిస్తే చారిత్రక ద్రోహం చేసిన పార్టీగా భావిస్తామని హెచ్చరించారు.

ఇప్పటికైనా బెహన్ మాయావతి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయం పైన దృష్టి సారించాలన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణలో బీఎస్పీ పార్టీ మాదిగలను దూరం చేసుకున్న పార్టీగా మిగిలిపోతుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తొలి లేక ఇచ్చి రాష్ట్రం సిద్ధించేటందుకు చొరవ చూపిన బెహన్ మాయావతి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలోను సానుకూలంగా స్పందించి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుపాటి కమలమ్మ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాయకులు బొజ్జ దేవయ్య, కత్తుల సన్నీ, మాసారం వెంకన్న, బొజ్జ నాగరాజు, సాయి, కొండల్, పబ్బిళ్ళ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

May 06 2023, 12:42

విస్తృతంగా వర్షాలు... 11 నుంచి మళ్లీ వడగాడ్పులు

కొనసాగుతున్న ఆవర్తనం..

నేడు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. రేపు అల్పపీడనం

ఆపై వాయుగుండం, తుపానుగా మార్పు

బంగ్లాదేశ్, మయన్మార్‌ల వైపు పయనించే అవకాశం..

11 తర్వాత నుంచి మళ్లీ వడగాడ్పులు

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 06 2023, 12:13

నేడు పాలమూరులో పర్యటించనున్న ఐటీ మంత్రి కేటీఆర్

మహబూబ్ నగర్ జిల్లా

పాలమూరు పారిశ్రామికంగా ఎదిగేందుకు సిద్దపడుతుంది. ఇన్నాళ్లూ ఉపాధికోసం సుదూర ప్రాంతాలకు వెళ్లిన యువతకు ఇపుడు ఉన్నచోటేకే పరిశ్రమలు పరుగులుపెడుతూ వస్తున్నాయి. ఐటీ పరిశ్రమ అంటే కేవలం మాధాపూర్‌.. గచ్చిబౌలీ ప్రాంతాలకే పరిమితమం అనుకుంటున్న తరుణంలో పాలమూరులో ఐటీ ఇంకుబ్యేటర్‌ సెంటర్‌ రూపుదిద్దుకుంది. సాంకేతిక ఉపాధి సైతం అందుబాటులోకి వచ్చింది. దీనికి తోడు అమర్‌ రాజా గిగా క్యారిడార్‌కు కూడా భూమిపూజ జరగనుండటంతో.. పాలమూరు యువతకు డబుల్‌ బొనాంజాగా మారింది.

స్థానిక యువతకు స్థానికంగా ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యంగా మహబూబ్‌నగర్ లో ఐటీ ఇంకుబ్యేషన్‌, ఎనర్జీ పార్కు ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఇక్కడ నిర్మించిన ఐదంతస్తుల ఐటీ టవర్ ప్రారంభోత్సవంతో పాటు, తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా భావిస్తోన్న అమరరాజా గిగా కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపనకు ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. ఈ నెల 6న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే.టీ.ఆర్‌, స్థానిక మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ పనులను ప్రారంభించనుండడంతో అధికారయంత్రాంగం ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.

జీవనోపాధిలేక వలసలు పోతున్న మహబూబ్‌నగర్ జిల్లాలోని యువతకు... స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్థానికంగా పరిశ్రమలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో 2018లో దివిటిపల్లి వద్ద 370 ఎకరాల భూమిని ఐటీ, మల్టిపుల్ ఇండస్ట్రియల్ పార్కుకు కేటాయించారు. 2018 జులైలో ఈ ఐటీ, ఇండస్ట్రియల్ పార్కుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. నాలుగెకరాల స్థలంలో 40 కోట్ల రూపాయలతో ఇక్కడ ఐదంతస్తుల ఐటీ టవర్‌ను టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో నిర్మించారు.

ఇక్కడ సార్ట్‌అప్‌ కంపెనీలు ఏర్పాటు చేయాలని కోరుతూ మంత్రి కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ లు ఐటీ సంస్థలను ఆహ్వానించగా.. ఈనెల ఆరు నుంచి కనీసం ఆరు కంపెనీలు ఇక్కడ తమ సంస్థల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించనున్నాయి. ఐతే ఈ ఐటీ టవర్‍ ప్రారంభం కానుండటంతో జిల్లాలోని వద్యార్థుల్లో సంతోషం వ్యక్తమౌతుంది.

ఈ టవర్లోని ఐదు అంతస్థుల్లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణపు స్థలం అందుబాటులోకి తీసుకువచ్చారు. దాంతో ఇక్కడ నలభై నాలుగు ఐటీ సంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహించేందుకు అనువుగా ఉంటుంది. అదేవిధంగా పది కాన్ఫరెన్స్‌ హాళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసే ఐ.టీ కంపెనీల్లో ఉద్యోగాలిప్పిస్తామంటోన్న ప్రభుత్వం ఆదిశగా కార్యాచరణ అమలు చేస్తోంది. ఐటీ టవర్ లోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ కూడా ఏర్పాటు చేసి.. నిరుద్యోగులకు రాబోయే సంస్థల్లో పనిచేసేందుకు అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, అదేవిధంగా టెక్నికల్ స్కిల్స్‌లో పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వెల్లడించారు.

ఇదిలాఉండగా దిగ్గజసంస్థ అమరారాజా గ్రూప్ కూడా ఇక్కడే గిగాసెల్‌ కారిడార్‌ను ఏర్పాటుచేయనుంది. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఏర్పాటు చేస్తున్న లిథియం గిసెల్..బ్యాటరీ ప్యాక్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధిత అమరరాజా గిగా కారిడార్‌కు సైతం శనివారం మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన చేయనున్నారు.

ఎలక్ట్రికల్ వాహనాల్లో వాడే బ్యాటరీలను పర్యావరణ హితంగా.. ఇక్కడ ఏర్పాటు చేసే కారిడార్‌లో ఉత్పత్తి చేస్తారని పేర్కొంటున్నారు. వచ్చే పదేళ్లలో ఈసంస్థ ఇక్కడ 9,500 కోట్ల రూపాయల పెట్టుబడులతో కంపెనీని విస్తరించనుందని, ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా 7,500 మందికి, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయి. ఒకవైపు ఐటీ ఇంకుబేటర్‌ కంపెనీలు.. మరోవైపు అమరరాజా గీగా కారిడార్ ఏర్పాట్లతో పాలమూరు ఉద్యోగ, ఉపాధి కల్పనకు కేంద్రంగా మారుతుందనే ఆశ నిరుద్యోగుల్లో చిగురిస్తోంది.

నిజంనిప్పులాంటిది

May 06 2023, 12:00

మహానగరంలో డ్రగ్స్ కలకలం

హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో శనివారం భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ప్రధాన నిందితుడు నైజీరియన్‌తో పాటు ఐదుగురిని సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నైజీరియన్‌కు చెందిన డ్రగ్స్ కింగ్ పిన్‌‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

కోట్ల రూపాయల కొకైన్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ ముఠా విదేశాల నుంచి కొకైన్ తెచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరికాసేపట్లో ఇదే అంశంపై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించనున్నారు.

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 06 2023, 11:58

చీకట్లో జీవోలు

వివిధ శాఖల్లో పని చేస్తున్న 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభ వేదికగా ప్రకటించారు. ఈ మేరకు 10 ప్రభుత్వ శాఖల్లోని 5,544 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తూ ఏప్రిల్‌ 30న రాష్ట్ర ఆర్థిక శాఖ జీవో నంబర్‌ 38ను జారీ చేసింది. వాస్తవంగా అయితే ఈ జీవో.. ప్రభుత్వ వెబ్‌సైట్‌ అయిన http://goir.telangana.gov.inలో కనపడాలి. కానీ కనిపించట్లేదు.

ఐఏఎస్‌ అధికారులు కోరెం అశోక్‌రెడ్డి, బి.గోపి, ఆశిష్‌ సంగ్వాన్‌లను బదిలీ చేసి, పోస్టింగులిస్తూ ఏప్రిల్‌ 28న సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) జీవో నంబర్‌ 613 జారీ చేసింది. మరో ఇద్దరు ఐఏఎ్‌సలు కె.హైమావతి, ఎం.సత్య శారదా దేవి సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో రిపోర్టు చేయాలని అందులోనే ఆదేశించింది. ఇదీ కనిపించుట లేదు.

మహారాష్ట్రకు చెందిన శరద్‌ మర్కడ్‌ను ముఖ్యమంత్రి ప్రైవేటు సెక్రటరీ(పీఎ్‌స)గా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ జీవో నంబర్‌ 647 జారీ చేసింది. ఈ జీవోను మే 2న జారీచేసినట్లు పేర్కొన్నప్పటికీ... శుక్రవారం (5న) వాట్సాప్‌ గ్రూపుల ద్వారా బయటకు వచ్చింది.

..ఇలా చెప్పుకొంటూ పోతే మరెన్నో! తప్పనిసరిగా ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పొందుపర్చాల్సిన ఇలాంటి జీవోలు చాలానే సర్కారీ వెబ్‌సైట్‌లో కనిపించట్లేదు. ప్రభుత్వం తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా జీవో రూపంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి. కానీ, పలు ముఖ్యమైన జీవోలను ప్రభుత్వం దాచిపెడుతోంది. ఇప్పుడే కాదు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం తీరు ఇలాగే ఉంది. ప్రభుత్వ పథకానికి సంబంధించినవి, భూసేకరణ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, బదిలీలు, నియామకాలు, నిధుల విడుదల, ఉద్యోగాలకు అనుమతి, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ... ఇలా ప్రతి కీలకమైన జీవోను దాచి పెడుతోంది. వాట్సాప్‌ గ్రూపులు లేదంటే ముఖ్యమంత్రి కార్యాలయ(సీఎంవో) వాట్సాప్‌ గ్రూపు ద్వారామాత్రమే వాటిని బయటపెడుతోంది. అదీ ప్రభుత్వానికి ఇబ్బంది లేదనుకునే జీవోలను మాత్రమే వాట్సాప్‌ గ్రూపుల ద్వారా బయటకు తెస్తున్నారు. వివాదాస్పద జీవో అనుకుంటే.. దానిని అసలు బయటే పెట్టడం లేదని, ఉద్దేశపూర్వకంగానే దాచిపెడుతోందని ఆరోపణలు వస్తున్నాయి.

పారదర్శకత కోసం

పాలనలో పారదర్శకతే లక్ష్యంగా చాలాకాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో పెట్టడం ప్రారంభించాయి. ఈ కోవలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా http://goir.telangana.gov.in వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఇందులో 32 శాఖలకు సంబంధించిన జీవోలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ శాఖలన్నింటి నుంచీ కలిపి ఏటా 6000 నుంచి 8000 దాకా జీవోలు వెలువడుతుంటాయి. అయితే, వీటిలో.. ప్రభుత్వ పథకాలు, నిధుల మంజూరు, ముఖ్యమైన నియామకాలు, పదోన్నతులు, పదవీ విరమణలు, వివిధ కమిషన్ల ఏర్పాటు, ఐఏఎ్‌సలు, ఇతర అధికారుల బదిలీలు, పదవీ బాధ్యతల అప్పగింత, వివిధ రకాల అనుమతులు, ఉద్యోగుల పదోన్నతులు, సర్వీసు మార్పులు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పోస్టుల భర్తీకి అనుమతులు వంటి అంశాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన జీవోలను మాత్రం ప్రభుత్వం ఆ వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్‌ చేయట్లేదు.

హైకోర్టు సీరియస్‌

2014 జూన్‌ 2 నుంచి 2019 ఆగస్టు 15 వరకు మొత్తం 1,04,171 జీవోలు వెలువడగా.. వాటిలో 43,462 జీవోలను వెబ్‌సైట్‌లో పొందుపర్చలేదంటూ 2019లో పేరాల శేఖర్‌రావు అనే సామాజిక కార్యకర్త హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్‌) వేశారు. దీనిపై హైకోర్టు సీరియస్‌ అయింది. ప్రజలకు తెలియాల్సిన జీవోలను ఎందుకు దాచిపెడుతున్నారంటూ అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ)ను ప్రశ్నించింది. మిస్సింగ్‌ జీవోలన్నింటినీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించింది. అలాగే.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకానికి సంబంధించిన జీవోను సైతం వెబ్‌సైట్‌లో పెట్టకపోవడంతో.. ‘వాచ్‌ వాయిస్‌ ఆఫ్‌ పీపుల్‌’ అనే స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో పిల్‌ వేసింది. దీనిపై 2021 ఆగస్టులో స్పందించిన హైకోర్టు... 24 గంటల్లో జీవోను అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించింది. అయినా సర్కారు తీరులో ఎలాంటి మార్పూ లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ 1 నుంచి ఈ నెల 5 వరకు మొత్తం 35 రోజుల్లో దాదాపు 250 వరకు జీవోలు వెలువరించినట్లు సమాచారం. కానీ.. ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ కలిగించని 163 రొటీన్‌ జీవోలు మాత్రమే వెబ్‌సైట్‌లో ఉన్నాయి. ప్రతిపక్షాల నుంచి ఎలాంటి విమర్శలు, ఆరోపణలు వచ్చేఅవకాశం లేని జీవోలు కాబట్టే వాటిని ప్రభుత్వం అప్‌లోడ్‌ చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నిజంనిప్పులాంటిది

May 06 2023, 11:55

నేడు అమరరాజా పరిశ్రమకు KTR శంకుస్థాపన

నేడు మహబూబ్నగర్ జిల్లాలో అమరరాజా లిథియం అయాన్ బ్యాటరీ గిగా ప్లాంటుకు శంకుస్థాపన చేయబోతున్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలు, సస్టేనబుల్ మొబిలిటీకి తెలంగాణ కేంద్రంగా మారెందుకు ఇది గొప్ప ముందడుగు అని పేర్కొన్నారు..

ఈ రంగంలో ఇండియాలో అతిపెద్ద పెట్టుబడుల్లో ఇదొకటని తెలిపారు. ఇందుకు తెలంగాణను ఎంచుకున్నందుకు అమర రాజా యజమాని గల్లా జయదేవ్ కు థాంక్స్ చెప్పారు. అలాగే, ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ సేవలు విస్తరించాలన్న ఉద్దేశంతో పలు నగరాల్లో ఐటీ టవర్లు నిర్మించేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ యోచన చేసిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగానే మహబూబ్నగర్కు ఐటీ సేవలను విస్తరించేందుకు ప్రణాళిక చేసింది. మహబూబ్‌నగర్‌ జిల్లాకు తలమానికం కానున్న ఐటి కారిడార్‌లో తొలి కంపెనీని ఇవాళ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు..

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 06 2023, 11:53

జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న ఎన్ కౌంటర్ : ఉగ్రవాది హతం

జమ్మూ కాశ్మీర్ లో వరస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. శుక్రవారం రాజౌరిలో ప్రారంభమైన ఎన్‌కౌంటర్ కొనసాగుతుండగా.. శనివారం బారాముల్లాలోని కర్హమా కుంజర్ ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్ ప్రారంభం అయినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.

బారాముల్లా ఎన్‌కౌంటర్ లో ఒక ఉగ్రవాదిని భద్రతాబలగాలు మట్టుపెట్టాయి. శనివారం తెల్లవారుజామున 1.15 గంటలకు ఉగ్రవాదలను భద్రతా బలగాలు గుర్తించాయి. ఇరు పక్షాల మధ్య కాల్పులు ప్రారంభమైనట్లు రక్షణ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు.

ఇదిలా ఉంటే నిన్న ప్రారంభం అయిన రాజౌరి ఎన్‌కౌంటర్లో ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. ముందుగా ఇద్దరు సైనికులు మరణించగా.. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు సైనికులు చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

శుక్రవారం మరణించినవారిలో నలుగురు 9 పారా(స్పెషల్ ఫోర్సెస్)కి చెందిన కమాండోలు కాగా.. ఒకరు రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్స్ కు చెందిన వారు. ఏప్రిల్ 20న పూంచ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత భద్రతాబలగాలు ఉగ్రవాదులను ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ ఎన్ కౌంటర్లు ఓటు చేసుకుంటున్నాయి. బుధవారం నుంచి వరసగా నాలుగురోజులుగా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి.

అంతకుముందు గురువారం బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరణించిన ఉగ్రవాదులను స్థానికులుగా గుర్తించారు. వీరిద్దరు నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రసంస్థ కోసం పనిచేస్తున్నారు. షోఫియాన్ జిల్లాకు చెందిన షకీర్ మాజిద్ నజర్, హనన్ అహ్మద్ గా గుర్తించారు. 2023లో ఇద్దరూ ఉగ్రవాదంలోకి చేరారు. బుధవారం కుప్వారాలోని పిచ్‌నాడ్ మచిల్ సెక్టార్ సమీపంలో చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదుల్ని సైన్యం, కాశ్మీర్ పోలీసులు హతమార్చారు.

నిజంనిప్పులాంటిది

May 06 2023, 09:54

రేపే నీట్

దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) యూజీ పరీక్ష ఆదివారం జరగనుంది. దేశవ్యాప్తంగా నీట్‌కు 20,87,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.

భారత్‌లో 499 నగరాలు, ఇతర దేశాల్లో 14 నగరాలు కలిపి మొత్తం 513 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఆదివారం మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు జరుగుతుంది. ఈనెల 3 నుంచి దరఖాస్తు చేసిన అభ్యర్థుల అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్న విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి సుమారు 70 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో 24 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది.

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 06 2023, 09:52

3,096 మంది కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజేషన్

అర్ధరాత్రి జాయినింగ్ ఆర్డర్స్

3న ఆదేశాలు, 4న జాయిన్ అయినట్లు ఉత్తర్వులు జారీ

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎట్టకేలకు ఇంటర్ కాంట్రాక్టు లెక్చరర్లు రెగ్యులరైజ్ అయ్యారు. జిల్లా ల్లో శుక్రవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ వారంతా జాయినింగ్ ఆర్డర్లు తీసుకున్నా రు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియెట్ 2,909 మంది రెగ్యులర్, 184 మంది ఒకేషనల్ లెక్చరర్లతో పాటు ముగ్గురు సీనియర్ ఇన్ స్ట్రక్టర్లను క్రమబద్ధీకరించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి అనుగుణంగా శుక్రవారం కాంట్రాక్టు లెక్చ రర్లకు ఇంటర్మీడియెట్ కమిషనరేట్ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో సాయంత్రం నుంచి కాంట్రాక్టు లెక్చరర్లు జాయినింగ్ ఆర్డర్స్ అందుకోగా, మిగిలిన జిల్లాల్లో అర్ధరాత్రి వరకూ వాటిని తీసుకున్నారు.

రెగ్యులరై జేషన్ ప్రక్రియ పూర్తిచేసేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లా డీఐఈఓ ఆఫీసులకు ఉదయమే రావాలని కాలేజీ ప్రిన్సిపల్స్, కాంట్రాక్టు లెక్చరర్లను ఆదేశిం చారు. దీంతో అన్ని జిల్లాల్లో ప్రిన్సిపాల్స్, లెక్చరర్లు ఉదయమే అక్కడికి చేరుకున్నారు. కానీ, మల్టీజోన్ 1, మల్టీజోన్ 2కు ఆర్జేడీ అధికారి ఒక్కరే ఉండటం, ఆమె హైదరాబాద్ లో ఉండటంతో డీఐఈఓ, జిల్లా నోడల్ ఆఫీసర్లు అపాయింట్మెంట్ ఆర్డర్లను తీసుకుపోయేందుకు హైదరాబాద్ కు వచ్చారు.

వ్యక్తిగత ఆర్డర్లపై ఆర్జేడీ సంతకాలు చేయాల్సి ఉండడంతో ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. హైద రాబాద్ నుంచి జిల్లాలకు డీఐ ఈఓలు, నోడల్ ఆఫీ సర్లు వచ్చేందుకు అర్ధరాత్రి వరకూ టైమ్ అయింది. దీంతో ప్రిన్సిపల్స్, కాంట్రాక్టు లెక్చరర్లు పొద్దంతా పడిగాపులు కాయాల్సి వచ్చింది. డీఐఈఓలు ప్రిన్సి పాల్స్ ద్వారా కాంట్రాక్టు లెక్చరర్లకు జాయినింగ్ ఆర్డర్స్ అందించారు.

అయితే, 3న రెగ్యులరైజేషన్ ఆర్డర్స్, 4న జాయిన్ అయినట్లు ఉత్తర్వులిచ్చారని తెలిసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తుది తీర్పుకు లోబడి అంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను పక్కనపెట్టి, గుట్టుచాటుగా ఇంటర్ అధికారులు అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేస్తు న్నారని ఓయూ జేఏసీ నేతలు గురువారం అర్థరాత్రి కమిషరేట్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్ కు తరలించారు.

నిజంనిప్పులాంటిది

May 06 2023, 09:50

ప్రాణం తీసిన ఇంస్టాగ్రామ్ వీడియో షూట్

ఇంస్టాగ్రామ్ వీడియో షూట్ చేస్తుండగా రైలు ఢీకొనడంతో యువకుడు మృతి చెందినట్టు తెలిసింది

సనత్‌నగర్ రైల్వే ట్రాక్ సమీపంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్ వీడియోలను రికార్డ్ చేస్తుండగా ఎక్ ప్రెస్ రైలు ఆకస్మాత్తు గా ఢీకొనడంతో సర్ఫరాజ్ అనే 16 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

వివరాల ప్రకారం మరణించిన సర్పరాజ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి శుక్రవారం వీడియోలు రికార్డ్ చేయడానికి సనత్‌నగర్ రైల్వే ట్రాక్‌కి వెళ్లాడు రైల్వే పట్టాలపై వీడియోలు షూట్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు రైల్వే పోలీసులు చెబుతున్నారు ..రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుని స్నేహితులను కూడా పోలీసులు అదుపు తీసుకున్నట్టు తెలిసింది.

SB NEWS

SB NEWS